బ్యాంకులో ప్రొబెషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే యువత కలలను సాకారం చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజా ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక జాతీయ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్స్/ మేనేజ్మెంట్ ట్రైనీస్ కు సంబంధించి 3 వేల 247 ఖాళీలను భర్తీ చేసేందుకు IBPS కామన్ రిటన్ ఎగ్జామినేషన్ (CWE PO/MT – VII) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో జనరల్ కేటగిరీకి 1,723, ఎస్సీలకు 482, ఎస్టీలకు 236, OBCలకు 806 పోస్టులు కేటాయించారు.
బ్యాంకులు – ఖాళీలు ఇలా ఉన్నాయి : అలహాబాద్ బ్యాంక్ 447, ఆంధ్రా బ్యాంక్ 200, బ్యాంక్ ఆఫ్ ఇండియా 200, కెనరా బ్యాంక్ 900, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 300, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 100, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in చూడవచ్చు
0 comments:
Post a Comment